అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని కోటగల్లి పాఠశాల లో గల ఎస్సీ వసతి గృ హం (SC hostel) నుంచి మిస్ అయిన ముగ్గురు అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం.
ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్లో (Hyderabad), ఒక అమ్మాయి ఆచూకీ నాందేడ్లో (Nanded) లభ్యమైనట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సమాచారం. విద్యార్థులను నిజామాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. వెనకబడిన తరగతుల వసతిగృహానికి (backward classes hostel) చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమైన విషయం తెలిసిందే. పదో తరగతికి చదువుతున్న ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెంటనే వారు పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు బాలికలను గుర్తించారు.