Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

Nizamabad City | బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | వరుస బైక్​ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వన్​టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వీక్లీ మార్కెట్​లో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి బైక్​ పత్రాలు చూపించాలని కోరగా వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

నగరంలోని హనుమాన్ నగర్​కు చెందిన గాజాబారే నగేష్, న్యాల్​కల్​ రోడ్​కు చెందిన హన్మంతే మోహన్​ను కలిసి మహాలక్ష్మి హాస్పిటల్ (Mahalaxmi Hospital) నుంచి బైక్​ను చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అలాగే జీజీహెచ్​లో (Nizamabad GGH) ఓ బైక్​ను చోరీ చేసినట్లు చెప్పారు. వినాయక్​ నగర్​కు చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తికి అమ్మేసినట్లు తెలిపారు. అలాగే ఆర్యనగర్​లో ఒక టీవీఎస్ ఎక్సెల్​ను, వీక్లీ మార్కెట్​లో మరొక బైక్​ను చోరీ చేసినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ వద్ద చెట్లపొదల్లో దాచినట్టు పోలీసులకు తెలిపారు. వారు చెప్పిన సమాచారంతో మూడు బైక్​లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​హెచ్​వో పేర్కొన్నారు. వీరితో పాటు షేక్ గౌస్​ను కూడా పట్టుకొని అతని వద్ద నుంచి బైక్​ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.