Homeజిల్లాలునిజామాబాద్​BJP Nizamabad | గోరక్షకుడిపై కాల్పులు జరిపిన వారిని అరెస్టు చేయాలి

BJP Nizamabad | గోరక్షకుడిపై కాల్పులు జరిపిన వారిని అరెస్టు చేయాలి

గోరక్షకుడిపై దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​కు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : BJP Nizamabad | హైదరాబాద్ (Hyderabad) శివారులో గోవుల అక్రమ తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన గోరక్షకుడు సోను సింగ్​పై కాల్పులు జరిపిన ఇబ్రహీంను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు.

జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ (Additional Collector Kiran Kumar)కు శనివారం వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. కాల్పుల ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడానికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News