Homeజిల్లాలునిజామాబాద్​Vishwa Hindu Parishad | గోరక్షకుడిపై దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

Vishwa Hindu Parishad | గోరక్షకుడిపై దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

గోరక్షకుడిపై దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందు పరిషత్​ డిమాండ్​ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు.

- Advertisement -

అక్షరటుడే,ఇందూరు: Vishwa Hindu Parishad | హైదరాబాద్​ శివారులోని పోచారం ఐటీ కారిడార్​లోని యమ్నంపేట వద్ద గోరక్షకుడిపై (Gorakshak) దాడిచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్​పీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ ఠాకూర్, జిల్లా కార్యదర్శి​ గాజుల దయానంద్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తా (NTR Chowrastha) వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. గోరక్షకులపై దాడులను నిలువరించాలని కోరారు. గోవులను అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకున్నందున అతడిపై దాడిచేయడం క్రూరమైన చర్యగా వారు అభివర్ణించారు. అలాగే నిందితుల వద్దకు గన్స్​ ఎలా వచ్చాయే విచారణ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకపోతే హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోబోవని చెప్పారు. కార్యక్రమంలో పరిషత్​ జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహా కార్యదర్శి దాత్రికా రమేష్, జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్, బజరంగ్​దళ్ (Bajrang Dal)​​ నగర సంయోజక్ పేట అఖిల్, అఖిలేష్, హర్షవర్ధన్, హిందూవాహిని, హైందవ సేన, ఆర్యాసమాజ్, గోరక్ష విభాగ్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News