ePaper
More
    HomeజాతీయంUnion Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి...

    Union Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి శివరాజ్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Union Minister Shivraj | ఎవరి ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదని, ఇది నయా భారత్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Minister Shivraj Singh Chouhan) అన్నారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

    భారత వస్తువులపై అమెరికా సుంకాలు (US tariffs)  విధించిన నేపథ్యంలో.. “వారు (యూఎస్) మనం భయపడతామని భావించారు. కానీ ఇది నేటి భారత్, ఇది ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని” చౌహాన్ తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ ఉత్పత్తులను (agricultural products) దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలనే డిమాండ్లను తాము అంగీకరించలేదని తెలిపారు. సోమవారం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    Union Minister Shivraj | జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట

    ఇది ఆధునిక భారతదేశమని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయదని చౌహాన్ అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం నిర్ణయం తీసుకుందని, రైతులు, మత్స్యకారుల (farmers and fishermen) ప్రయోజనాలపై రాజీ పడదన్నారు. “ప్రపంచం (యూఎస్) మీరు మాతో ఏకీభవిస్తున్నారని చెప్పింది. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మన ద్వారాలు తెరవాలని కోరుకున్నారు. వారు వేలాది హెక్టార్ల భూమిలో పండిన జన్యుమార్పిడి విత్తనాలతో వ్యవసాయం చేస్తారు. సబ్సిడీలు పొందుతారు. ఈ క్రమంలో తలెత్తే పోటీని మన చిన్న రైతులు తట్టుకోలేరు. అందుకే తాము జీఎం విత్తనాలను భారత్​లోకి అనుమతించ లేదు” అని చౌహాన్ తెలిపారు.

    Union Minister Shivraj | స్వదేశీ ఉత్పత్తులనే కొనండి..

    రోజువారీగా ఉపయోగించేందుకు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 144 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేశారన్న చౌహన్.. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రశంసించే మనస్తత్వాన్ని ఆయన విమర్శించారు. భారతదేశంలో అపారమైన ప్రతిభ, బలమైన శ్రామిక శక్తి ఉందని చౌహాన్ అన్నారు. “దేశంలో పుష్పక్ వైమానిక వాహనం ఉంది, దాని గురించి (రామాయణంలో) ప్రస్తావించబడింది” అని ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    mid-day meal | మధ్యాహ్న భోజనం తిన్న 28 మంది విద్యార్థులకు అస్వస్థత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: mid-day meal : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌...

    More like this

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...