Homeక్రైంSBI ATM | ఏటీఎంలో చోరీ చేసి నిప్పు పెట్టిన దొంగలు

SBI ATM | ఏటీఎంలో చోరీ చేసి నిప్పు పెట్టిన దొంగలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : SBI ATM | ఏటీఎంలో చోరీ చేయడమే కాకుండా నిప్పు పెట్టి పారిపోయారు దుండగులు. ఈ ఘటన సూర్యాపేట(Suryapeta) జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ (Huzur Nagar)​లోని లింగగిరి రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం (sbi atm)లో రాత్రి చోరీ జరిగింది. కారులో వచ్చిన దొంగలు గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని రూ.20 లక్షలు ఎత్తుకెళ్లారు. అనంతరం ఏటీఎంకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News