అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Mopal | మోపాల్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఏకంగా పదిళ్లలో చోరీలకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కులాస్పూర్లో (Kulaspur) బుధవారం రాత్రి దొంగల ముఠా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని పాల్పడింది. ముఠా సభ్యులు రాత్రి పదిళ్లలో చోరీలు చేశారు. సుమారు 5 తులాల బంగారం.. రూ. 2లక్షలకు పైగా నగదు చోరీకి గురైనట్లు సమాచారం. పక్కన ఉన్న ఇళ్లకు బయటి నుంచి గడియ పెట్టి దుండగులు చోరీలు చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని విచారణ చేస్తున్నట్లు మోపాల్ సీఐ సురేష్ (Mopal CI Suresh) పేర్కొన్నారు.
