అక్షరటుడే, వెబ్డెస్క్: Srikakulam | ఓ దొంగ ఏకంగా హెడ్ కానిస్టేబుల్ బైక్ను ఎత్తుకెళ్లాడు. అది కూడా పోలీస్ స్టేషన్ నుంచి చోరీ చేయడం గమనార్హం. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్లో (Andhra Pradesh) చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ (Narasannapet police station) పరిధిలో ఇటీవల చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు. ఆ సమయంలో అదును చూసిన సదరు వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ బైక్పై పరారయ్యాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కాగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ బైక్(head constable bike)తో పరార్ అవుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
