అక్షరటుడే, వెబ్డెస్క్ : Union Minister Kiren Rijiju | పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్పై లోక్ సభలో చర్చ జరగకుండా ప్రతిపక్షం “ద్రోహం” చేసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోమవారం విమర్శించారు. ఆపరేషన్ సిందూర్పై (Operation Sindoor) చర్చకు ప్రతిపక్షం తొలి ఒప్పందం తర్వాత పారిపోతోందని, ఇప్పుడు ముందస్తు షరతులు విధిస్తోందన్నారు.
చర్చ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆపరేషన్ సిందూర్ చర్చ ముగిసిన తర్వాత బీహార్లో (Bihar) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాపై చర్చకు అనుమతిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ప్రతిపక్షం కోరిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం నడుస్తుందని, ప్రతిపక్షం తన నిబద్ధత నుండి వెనక్కి వెళ్లి అందరికీ ద్రోహం చేస్తోందని రిజిజు (Union Minister Kiren Rijiju) ఆరోపించారు. ‘‘ఆపరేషన్ సిందూర్పై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్షం మార్గాలను పరిశీలిస్తోంది’’ అని విమర్శించారు.
Union Minister Kiren Rijiju | అడ్డు తగిలిన విపక్షాలు..
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’పై సోమవారం లోక్ సభలో (Lok Sabha) ప్రత్యేక చర్చ జరగాల్సి ఉంది. అయితే, సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆపరేషన్ సిందూర్పై చర్చ తర్వాత బీహార్లో ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision)పై చర్చించాలని పట్టుబట్టాయి. ముందుగా ఆపరేషన్ సిందూర్పై చర్చిద్దామని స్పీకర్ పలుమార్లు కోరినప్పటికీ విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. స్పీకర్ పలుమార్లు సర్దిచెప్పినప్పటికీ వారు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభాపతి సభను వాయిదా వేశారు.
Union Minister Kiren Rijiju | చర్చలు లేకుండానే వాయిదాలు..
బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా లోక్ సభ రెండుసార్లు వాయిదా పడింది. జూలై 21న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి గత వారం ఒక్క రోజు కూడా సభ సరిగ్గా పనిచేయలేకపోయింది. ఆపరేషన్ సిందూర్ మరియు ఎన్నికల కమిషన్(Election Commisssion) ప్రారంభించిన బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై చర్చ కోసం డిమాండ్ చేయడంపై ప్రతిపక్ష నిరసనల తరువాత పదేపదే వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడ్డారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చూపిస్తూ సభ వెల్ వద్దకు కూడా వచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు కోరినప్పటికీ వారు వెళ్లకపోవడంతో సభను వాయిదా వేశారు.