Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | దొంగనోట్ల కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు..: ఆసిఫ్​ ఆవేదన

Nizamabad City | దొంగనోట్ల కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు..: ఆసిఫ్​ ఆవేదన

తనను ఫేక్​ కరెన్సీ కేసులో ఇరికించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆసిఫ్​ పేర్కొన్నారు. కానిస్టేబుల్​ ప్రమోద్​ను​ హత్య చేసిన రియాజ్​ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్​ గాయపడ్డ విషయం తెలిసిందే.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | కొందరు వ్యక్తులు తనను దొంగనోట్ల (counterfeit currency) కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆసిఫ్​ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన రౌడీషీటర్​ రియాజ్​(rowdy sheeter Riyaz)కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియాజ్​ను పట్టుకునే సమయంలో తన చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని పేర్కొన్నారు.

Nizamabad City | ‘నా గురించి ఎక్కడైనా విచారించుకోవచ్చు..’

ఫేక్ కరెన్సీతో (fake currency) తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్​ తనపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. మరికొంతమంది వాట్సాప్​లో తప్పుడు సమాచారం పంపిస్తూ తనను చంపుతానని బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటివరకు తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని తనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా తానుంటున్న కాలనీకి వచ్చి ఎవరినైనా ఎంక్వైయిరీ చేసుకోవచ్చని పేర్కొన్నారు.