Nizamabad City | ‘తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు’

అక్షర టుడే, ఇందూరు: Nizamabad City | తమపై యజమాని తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని నగరంలోని (Nizamabad) గాంధీగంజ్‌లో గల సిల్వర్‌ మర్చంట్‌లో పనిచేస్తున్న కన్నయ్య, ప్రశాంత్‌ అనే యువకులు ఆరోపించారు. బాధితులు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరేళ్లుగా అదే సిల్వర్‌ మర్చంట్‌లో (silver merchant) పని చేస్తున్నామన్నారు. వేతనం పెంచాలని, లేకపోతే వెళ్లిపోతామని యజమానులకు చెప్పామన్నారు. అయితే యజమానులైన అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత విభేదాలు, దొంగ […]

అక్షర టుడే, ఇందూరు: Nizamabad City | తమపై యజమాని తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని నగరంలోని (Nizamabad) గాంధీగంజ్‌లో గల సిల్వర్‌ మర్చంట్‌లో పనిచేస్తున్న కన్నయ్య, ప్రశాంత్‌ అనే యువకులు ఆరోపించారు. బాధితులు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరేళ్లుగా అదే సిల్వర్‌ మర్చంట్‌లో (silver merchant) పని చేస్తున్నామన్నారు. వేతనం పెంచాలని, లేకపోతే వెళ్లిపోతామని యజమానులకు చెప్పామన్నారు. అయితే యజమానులైన అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత విభేదాలు, దొంగ బంగారం కేసు (Gold Theft Case) ఉండడంతో ఇదే అదునుగా తమని తప్పుడు కేసులో ఇరికించాలని యత్నిస్తున్నట్లు వాపోయారు.

70 కేజీల వెండి దొంగతనం చేసినట్లు కావాలని ఇరికించారని, దుకాణంలో సీసీ కెమెరాలు పరిశీలించాలని కోరారు. గత నెల 9న గొడవ జరగగా, రాత్రి తమని యజమానులు కొట్టారని, అంతేగాక తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తమ బైక్, మూడు సెల్‌ఫోన్లు దౌర్జన్యంగా లాక్కున్నారని తెలిపారు. తాము ఎక్కడికి పారిపోమని, పోలీసులకు సహకరిస్తామని చెప్పారు. తమ పిల్లలకు ఏదైనా జరిగితే షాప్‌ యజమానులే బాధ్యత వహించాలని యువకుల తల్లిదండ్రులు వాపోయారు.

Related articles

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Harish Rao contractor payments | చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు...

Advocate Attack Case | న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రుద్రూర్​లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Peaceful Municipal Elections | అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు

అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు పలువురు అధికారులను సన్మానించారు.