IPL | ఐపీఎల్​ టాపర్లు వీరే..
IPL | ఐపీఎల్​ టాపర్లు వీరే..

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL | ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(Indian Premier League) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే సగం సీజన్​(season) పూర్తయింది. పలువురు బ్యాట్​తో మెరుపులు మెరిపిస్తుంటే, మరికొందరు బాల్​తో మాయ చేస్తున్నారు. కొందరు ఆటగాళ్లు బంతిని బౌండరీలకు దాటిస్తుందటే.. బౌలర్లు యార్కర్లతో వికెట్లను గింగిరాలు తిప్పుతున్నారు. ఆఖరు ఓవరు వరకు గెలుపు ఎవరిదో తెలియకుండా చాలా మ్యాచ్​లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక పరుగులు, వికెట్లు(wickets) తీసిన ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.

IPL | అత్యధిక పరుగులు చేసింది వీరే..

గుజరాత్​ టైటాన్స్(Gujarat Titans)​ ఓపెనర్ సాయిసుదర్శన్​​ ఈ సీజన్​లో ఇప్పటి వరకు టాప్​స్కోరర్​గా నిలిచాడు. ఆయన 417 పరుగులతో టాప్​లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో లక్నో ఆటగాడు నికోలస్​ పూరన్​ 377, గుజరాత్​ ప్లేయర్​(Gujarat Player) బట్లర్​ 356 ఉన్నారు.

IPL | ఎక్కువ వికెట్లు వీరికే..

ఈ సీజన్​లో పలు లోస్కోర్​ మ్యాచ్​లు కూడా నమోదు అయ్యాయి. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసి వికెట్లు తీస్తూ.. పరుగులను కట్టడి చేశారు. ఈ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్(Gujarat Titans)​ బౌలర్​ ప్రసిద్​ కృష్ణ అత్యధికంగా 16 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్​(Delhi Capitals) ఆటగాడు కుల్​దీప్​ యాదవ్​ 12, చెన్నై బౌలర్​ నూర్​ అహ్మద్​ 12 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

IPL | బౌండరీల బాసులు వీరే..

ఐపీఎల్(IPL)​లో ఇప్పటి వరకు నికోలస్​ పూరన్​ (లక్నో) 31 సిక్స్​లతో టాప్​లో ఉన్నాడు. శ్రేయాస్​ అయ్యర్​(పంజాబ్​) 20, మిచెల్​ మార్ష్​(లక్నో) 18 సిక్సర్లు కొట్టారు. గుజరాత్​ ఓపెనర్​ సాయి సుదర్శన్​ 42 ఫోర్లతో మొదటి స్థానంలో ఉండగా, బట్లర్​(గుజరాత్​) 40, మిచెల్​ మార్ష్​(లక్నో) 33 ఫోర్లు కొట్టారు.