Godavari Water | గోదావరి జలాల్లో రాజీ లేదు.. తెలంగాణ పిటిషన్​పై రేపు సుప్రీం విచారణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Water | గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టును (Polavaram-Nallamala Sagar project) అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Water | గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టును (Polavaram-Nallamala Sagar project) అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది.

ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సింఘ్వీని కలిశారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, సాక్ష్యాలను సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు.

Godavari Water | రిట్​ పిటిషన్​

అనుమతులు పొందకుండా పోలవరాన్ని బనకచర్ల, నల్లమల సాగర్‌తో అనుసంధానించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రాజెక్టును వాస్తవంగా ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మించాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధంగా అనుమతించదగినది కాదని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడాన్ని కూడా వ్యతిరేకించింది.

కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) డీపీఆర్ తయారీతో ముందుకు వెళ్తోందని పేర్కొంది. ఈ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.