ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | రాష్ట్రంలో ఉండేది త‌క్కువ‌.. ఢిల్లీలోనే ఎక్కువ‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై క‌విత ఫైర్‌

    MLC Kavitha | రాష్ట్రంలో ఉండేది త‌క్కువ‌.. ఢిల్లీలోనే ఎక్కువ‌.. సీఎం రేవంత్‌రెడ్డిపై క‌విత ఫైర్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. మోస‌పూరిత హామీల‌తో గ‌ద్దెనెక్కి, హామీలు అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని మండిప‌డ్డారు.

    రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో ఉండేది త‌క్కువ‌.. ఢిల్లీ(Delhi)లో ఉండేది ఎక్కువ అని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గృహ‌లక్ష్మి ప‌థకాన్ని వెంట‌నే ప్రారంభించాల‌ని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లోని కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలో క‌విత పోస్టుకార్డు ఉద్య‌మం ప్రారంభించారు.

    ఈ సంద‌ర్భంగా ఆమె విలేక‌రుల‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉండేది తక్కువని.. ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారన్నారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నార‌ని ఆరోపించారు.

    MLC Kavitha | హామీల అమ‌లేది?

    ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన హామీల అమ‌లు ఏమైంద‌ని క‌విత ప్ర‌శ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చదువుకునే విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు ఎటు పోయాయ‌ని ప్రశ్నించారు.

    READ ALSO  BC Reservations | బీసీలకు వెన్నుపోటు పొడిచిన బీఆర్​ఎస్​ : పీసీసీ చీఫ్​

    ఆడపిల్ల పెళ్లికి లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామ‌న్నారని.. ఈ 18 నెలలలో ఎక్కడైనా ఇచ్చారా; అని నిలదీశారు. రైతులంద‌రికీ రుణ‌మాఫీ (Runamafi) చేయ‌కుండా, కొంద‌రికే ఇచ్చి చేతులు దులుపుకున్నార‌న్నారు. మ‌హిళ‌లంద‌రికీ ఇస్తామ‌న్న రూ.2,500 పింఛ‌న్ ఎటు పోయింద‌ని ప్ర‌శ్నించారు.

    MLC Kavitha | పాల‌న‌లో విఫ‌లం..

    రేవంత్‌రెడ్డి పాల‌న‌లో విఫ‌ల‌మ‌య్యార‌ని క‌విత ఆరోపించారు. ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం చేత‌కాక ఇత‌రుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ విమర్శించారు.

    ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉన్నారని అని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్‌ (Mahabubnagar)లో అంబులెన్సులలో కనీసం డీజిల్ పోసే పరిస్థితి లేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు.

    READ ALSO  CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    రేషన్ షాప్‌ల్లో ఇస్తున్న సన్న బియ్యంలో 50 శాతం దొడ్డు బియ్యమే అని నిరూపిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఫ్రీ బస్సు పేరున గ్రామాలకు వెళ్లే బస్సుల‌ సంఖ్య‌ను త‌గ్గించార‌న్నారు. ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం కాదని.. వెంటపడి పని చేయించుకోవాల్సి వ‌స్తోంద‌న్నారు.

    Latest articles

    Thailand-Cambodia | మరో యుద్ధం మొదలైందా.. దాడులు చేసుకుంటున్న కంబొడియ, థాయిలాండ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Thailand-Cambodia | రష్యా–ఉక్రెయిన్​, ఇజ్రాయెల్–గాజా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. తాజాగా మరో యుద్ధం...

    Chittoor | ల్యాబ్​ టెక్నీషియన్​తో విద్యార్థి ప్రేమ.. ఇద్దరు కలిసి జంప్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chittoor | ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమ, డబ్బు కోసం కొందరు ఎంతకైనా...

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు...

    Mla Pocharam | శాంతి దూత ఏసుప్రభువు: ఎమ్మెల్యే పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ఏసుక్రీస్తు (Jesus Christ)...

    More like this

    Thailand-Cambodia | మరో యుద్ధం మొదలైందా.. దాడులు చేసుకుంటున్న కంబొడియ, థాయిలాండ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Thailand-Cambodia | రష్యా–ఉక్రెయిన్​, ఇజ్రాయెల్–గాజా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. తాజాగా మరో యుద్ధం...

    Chittoor | ల్యాబ్​ టెక్నీషియన్​తో విద్యార్థి ప్రేమ.. ఇద్దరు కలిసి జంప్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chittoor | ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమ, డబ్బు కోసం కొందరు ఎంతకైనా...

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు...