అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలోని కల్లెడి గ్రామంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని పీహెచ్సీని సందర్శించి, ప్రజలకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు.
అనంతరం సహకార సంఘం ఎరువుల గోదాంను తనిఖీ చేసి, అక్కడ నిల్వ ఉంచిన ఎరువుల పరిస్థితిని పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే యాసంగి సీజన్లో (Yasangi Season) కూడా ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
Collector Nizamabad | పట్టా పాస్బుక్స్ లేని వాళ్లకు..
పట్టా పాస్బుక్స్ లేని రైతులు (Farmers) పంటలు సాగు చేస్తే వారికి కూడా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే వారు వాస్తవంగా పంటలు వేశారా లేదా అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. అటు తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (Zilla Parishad High School) సందర్శించిన కలెక్టర్.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అదే విధంగా ఆలూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయాన్ని (Tahsildar Office) సందర్శించిన కలెక్టర్, భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా దరఖాస్తులు ఎంతమేరకు పరిష్కరించారు.. పెండింగ్లో ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలన చేసి పరిష్కరించాలని తహశీల్దార్ రమేశ్(Tahsildar Ramesh)కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) నుండి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. అదనంగా ఆలూర్లో నిర్మాణం జరుగుతున్న 30 పడకల ఆస్పత్రి పనులను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, తహశీల్దార్ రమేష్, ఏఆర్ఐ రేణుక, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, డాక్టర్ ప్రకాష్, హెచ్ఎం నాగరాజ్, ప్రణయ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.