MLC Kavitha

MLC Kavitha | అన్ని పార్టీల్లో వివాదాలు ఉన్నాయి.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | అన్ని పార్టీల్లో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె జాగృతి కార్యాలయం(Jagruti Office)లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మిక సంస్థ హెచ్​ఎంఎస్​తో జాగృతి పొత్తు పెట్టుకుందన్నారు.ఈ రెండు సంస్థలు కలిసి సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తాయన్నారు.

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇటీవల బీఆర్​ఎస్​పై వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పరోక్షంగా కేటీఆర్​(KTR)ను ఉద్దేశిస్తూ ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి జగదీశ్​రెడ్డిపై సైతం ఆమె విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందన్నారు. కాంగ్రెస్​లో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఏదైనా మాట్లాడితే.. అర గంటలోనే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తారని చెప్పారు. బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్​(Bandi Sanjay)కు ఈటల రాజేందర్(Eatala Rajender)​ డైరెక్ట్​గా వార్నింగ్‌ ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​లో కూడా అలాగే ఉంటుందని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కవిత అన్నారు.

 MLC Kavitha | కరప్షన్​ గనిగా సింగరేణి..

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చినప్పటి నుండి సింగరేణిని కరప్షన్ గనిగా మార్చిందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ అంచనాలు రాత్రికి రాత్రే పెంచారని ఆరోపించారు. దాదాపు రూ.1500 నుంచి రూ.2 వేల కోట్ల అంచనాలు పెంచారన్నారు. అలాగే సోలార్​ ప్లాంట్లు పెట్టడంలో కూడా స్కామ్​లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందన్నారు. దీనిని నిర్మూలించడానికి కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు.

 MLC Kavitha | కార్మికులను మోసం చేశారు

నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ సర్కార్ అని కవిత విమర్శించారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 33 శాతం వాటా అని ప్రకటించి లాభాలను తక్కువగా చూపెట్టి మోసం చేశారన్నారు. ఈ సారి లాభాల్లో 35శాతం వాటా దసరా బోనస్​ కింద జమ చేయాలని డిమాండ్​ చేశారు.
తెలంగాణ జాగృతి, సింగరేణి కార్మిక సంస్థ హెచ్​ఎంఎస్(Singareni Labor Organization HMS)​ మధ్య పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. సింగరేణిలో ప్రస్తుతం గెలిచిన కూటమి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి లో అండర్​ గ్రౌండ్​ గనులను ఓపెన్​ చేయాలన్నారు. అసంఘటిత, సంఘటిత కార్మికులతో త్వరలో సంఘం ఏర్పడుతుందన్నారు. దీనిలో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్​ఎంఎస్​ అధ్యక్షుడు రియాజుద్దీన్​(HMS President Riazuddin) పాల్గొన్నారు.