- Advertisement -
HomeUncategorizedTirumala | పరకామణిలో 20 ఏళ్లుగా చోరీ జరుగుతోంది.. భూమన సంచలన వ్యాఖ్యలు

Tirumala | పరకామణిలో 20 ఏళ్లుగా చోరీ జరుగుతోంది.. భూమన సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలోని శ్రీవారి ఆలయం (Srivari Temple)లో పరకామణి (Parakamani) వ్యవహారంపై టీటీడీ మాజీ ఛైర్మన్​ భూమన కరుణాకర్​రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రవికుమార్​ అనే వ్యక్తి పరకామణిలో 20 ఏళ్లుగా చోరీకి పాల్పడుతున్నట్లు భూమన తెలిపారు. తమ హయాంలోనే ఆయనను పట్టుకున్నట్లు చెప్పారు. గతంలో చంద్రబాబు (Chandrababu) సీఎంగా ఉన్న సమయంలో కూడా రవికుమార్​ చోరీ చేశాడన్నారు. అప్పుడు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. తాను ఛైర్మన్​గా ఉన్న సమయంలోనే రవికుమార్​ చోరీ చేస్తున్న విషయాన్ని బయట పెట్టామన్నారు. ఆయన నుంచి రూ.100కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు. దమ్ముంటే విజిలెన్స్ రిపోర్ట్ (Vigilance Report) బయటపెట్టాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సవాల్​ చేశారు.

- Advertisement -

Tirumala | సీబీఐతో విచారణ చేయించాలి

పరకామణిలో చోరీ విషయమై మంత్రి నారా లోకేశ్​ (Nara Lokseh), టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. ఈ కేసును సీఐడీతో కాకుండా సీబీఐ (CBI)తో విచారణ చేయించాలన్నారు. దొంగతనానికి పాల్పడిన రవికుమార్​కు తమిళనాడు, కర్ణాటక, ఏపీలో సైతం ఆస్తులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

Tirumala | తల నరుక్కుంటా

తన హయాంలో ఈ ఘటన జరిగిందే నిజమైతే అలిపిరి దగ్గర తల నరుక్కుంటానని కరుణాకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తిరుమలను రాజకీయలకు అడ్డగా మార్చిందని విమర్శించారు. 2023లోనే రవి కూమార్ పరకామణిలో 800 డాలర్లు చోరీ చేయగా పట్టుకున్నామన్నారు. విజిలెన్స్​ వాళ్లను బెదిరించి ఆ సీసీ టీవీ వీడియోలను ప్రస్తుతం బయట పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన చోరీలపై వీడియోలు సైతం బయట పెట్టాలని డిమాండ్​ చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News