HomeతెలంగాణMulugu | రీల్స్ కోసం వెళ్లి అడవిలో తప్పిపోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

Mulugu | రీల్స్ కోసం వెళ్లి అడవిలో తప్పిపోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu | ప్రస్తుతం యువత సోషల్​ మీడియాకు బానిసలుగా మారారు. రీల్స్​, షార్ట్స్​ చేసి సోషల్​ మీడియాలో పెట్టి ఫేమస్​ కావాలని యత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ (Reels)​ కోసం అడవిలోకి వెళ్లి తప్పిపోయాడు.

ములుగు జిల్లాకు (Mulugu District) చెందిన అబ్రార్​ అనే యువకుడు సోమవారం జిల్లాలోని అటవీ ప్రాంతంలో గల ముత్యంధార జలపాతం (Mutyamdhara Falls) సందర్శనకు ఒంటరిగా వెళ్లాడు. రీల్స్​ చేయడానికి మొబైల్​ పట్టుకొని అక్కడకు వెళ్లాడు. తాపీగా రీల్స్​ చేసుకొని సాయంత్రం పూట తిరిగి ఇంటికి బయలు దేరాడు. అయితే దట్టమైన అటవీ ప్రాంతం (Dense Forest Area) కావడంతో దారి మరిచిపోయాడు. అడవిలో తప్పిపోయాడు.

Mulugu | డయల్​ 100కు ఫోన్​

రీల్స్​ కోసం వెళ్లిన అబ్రార్​ అడవిలో దారి దొరకక భయాందోళనకు గురయ్యాడు. చీకటి పడుతుండడంతో ఏం చేయాలో తోచక వెంటనే డయల్ 100కు ఫోన్​ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు అతడి కోసం సెర్చ్​ ఆపరేషన్ (Search Operation)​ నిర్వహించారు. సుమారు ఆరు గంటల పాటు అడవిలో గాలించగా యువకుడి ఆచూకీ దొరికింది.

Mulugu | కేసు నమోదు

ముత్యంధార జలపాతం దట్టమైన అటవీ ప్రాతంలో ఉంది. అక్కడికి ఎవరినీ అనుమతించరు. దీంతో కొందరు యువకులు అధికారులకు తెలియకుండా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అబ్రార్​ సైతం అలాగే వెళ్లి తప్పిపోయాడు. నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన ఆయనపై అటవీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. యువకుడికి కౌన్సెలింగ్​ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

 Mulugu | అక్కడకు వెళ్లొద్దు..

ముత్యంధార జలపాతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందని, అక్కడికి ఎవరికీ అనుమతి లేదని అటవీ శాఖ అధికారులు (Forest Officers) తెలిపారు. యువకుడి కోసం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు గాలించినట్లు వారు పేర్కొన్నారు. ఫోన్​ సిగ్నల్​ ఆధారంగా యువకుడి ఆచుకీ కనుగొని బయటకు తీసుకు వచ్చామన్నారు. నిషేధిత జలపాతాలకు కొందరు దొంగచాటుగా వెళ్తున్నారన్నారు. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని, ల్యాండ్​మైన్లు, ప్రెషర్ బాంబులు ఉండే అవకాశం ఉందని ఫారెస్ట్​ అధికారులు తెలిపారు. పర్యాటకులు నిషేధిత ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.