Tirumala | తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం రాత్రితో ముగియనున్నాయి. పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా డిసెంబర్​ 30 నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. గతేడాది తొక్కిసలాట చోటు చేసుకోవడంతో టీటీడీ అధికారులు (TTD Officers) ఈ సారి పక్కాగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డిసెంబర్​ 30 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం రాత్రితో ముగియనున్నాయి. పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు.

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా డిసెంబర్​ 30 నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. గతేడాది తొక్కిసలాట చోటు చేసుకోవడంతో టీటీడీ అధికారులు (TTD Officers) ఈ సారి పక్కాగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డిసెంబర్​ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ దర్శనాలకు అనుమతి ఇచ్చారు. నేడు అర్ధరాత్రి ఉత్తర ద్వారాన్ని అధికారులు మూసి వేయనున్నారు. బుధవారం వరకు స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా 7,09,831 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఒక్క రోజే 85 వేలకు పైగా భక్తులు రావడం గమనార్హం. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా ఉంది.

Tirumala | రేపటి నుంచి ప్రత్యేక దర్శనాలు

వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఈ ఏడాది టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది. దర్శనం కోసం క్యూలైన్​లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు పంపిణీ చేశారు. అయితే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. రేపటి నుంచి ప్రత్యేక దర్శన సేవలు (Special Darshan Services) యథావిధిగా కొనసాగనున్నాయి.

Related articles

Kalvakuntla Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ : కల్వకుంట్ల కవిత

జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ఆమె మాట్లాడారు

Kamareddy Yellow Alert | కామారెడ్డికి ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Yellow Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి (Kamareddy), కొమురం భీం...

Municipal Election Shock | బీజేపీ, బీఆర్​ఎస్​లకు మున్సిపల్​ ఎన్నికలు షాక్​ ఇచ్చాయి : మానాల మోహన్​రెడ్డి

మున్సిపల్​, జీపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​లకు షాక్​ తగిలిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Kamareddy Land Dispute | రాజకీయ లబ్ధి కోసమే కళాశాల ఆస్తుల వివాదం: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కళాశాల ఆస్తుల వివాదాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే కేవీఆర్​ అన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఆయన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ను కలిసి వినతిపత్రం అందజేశారు.