Mla Prashanth reddy
Mla Prashanth reddy | తులం బంగారం పథకాన్ని వెంటనే అమలు చేయాలి

అక్షరటుడే, భీమ్​గల్​: Mla Prashanth reddy | కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో వచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. వేల్పూర్​లోని (Velpur) తన కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీముబారక్ (Shadi Mubarak)​ దరఖాస్తులపై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

కొత్తగా వివాహాలు జరిగిన వారికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా అదనంగా ఇస్తామన్న తులం బంగారం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. భీమ్​గల్​లో 136, మెండోరా 46, మోర్తాడ్ 27 ఇలా మొత్తం 244 దరఖాస్తులు వచ్చాయన్నారు.

కొత్తగా చెక్కులు మంజూరయ్యే లబ్ధిదారులకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని పేర్కొన్నారు.