HomeతెలంగాణTiranga Rally | 19న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి

Tiranga Rally | 19న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Tiranga Rally | నగరంలో 19న నిర్వహించనున్న తిరంగా ర్యాలీని (Tiranga Rally) విజయవంతం చేయాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో (MLA Camp Office) విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్ (Pakistan)​లో ఉగ్రవాదులు మరణిస్తే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ప్రపంచమంతా చూసిందన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటుంది కాబట్టే ‘ఆపరేషన్​ సింధూర్​’ను తాత్కాలికంగా నిలిపేసిందన్నారు.

ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైనందుకు సైనికులకు కృతజ్ఞతాభావంగా ఈనెల 19న జిల్లా కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాకిస్తాన్​లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేయడంతో భారత సైనిక శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటామన్నారు. ఎస్–400 (S-400) సుదర్శన చక్రంలా భారతదేశాన్ని కాపాడిందని కొనియాడారు. సమావేశంలో తిరంగా ర్యాలీ కన్వీనర్ కృపాకర్ రెడ్డి (Tiranga Rally Convener Krupakar Reddy), శంకర్, వెంకట రమణ, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.