అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఆదివారం (ఆగస్టు 3) తీజ్ సంబరాలు అంబరాన్ని అంటాయి. బంజారాల(Banjaras) సంస్కృతి(cultural), సంప్రదాయ వేడుక(traditional celebration)గా పేర్కొనే ఈ తీజ్లో మహిళలు సందడి చేశారు. యువతులు ఆడిపాడారు. నగరంలో డీజే డ్యాన్సుల మధ్య గోధుమ బుట్టలతో ఊరేగింపు నిర్వహించారు. వందల సంఖ్యలో బంజారాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బంజారాల జీవనశైలి ఎంత ప్రత్యేకమైనదో వేడుకగా ప్రదర్శించారు. బంజారాల జానపద గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



