Supreme Court | ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | ఏసీబీ కేసులపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు (Andhra Pradesh High Court) ఎఫ్​ఐఆర్​లను కొట్టివేస్తూ వెలువరించిన తీర్పును తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్​లో నమోదైన ఏసీబీ కేసుల ఎఫ్​ఐఆర్​లను గతంలో ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) ఆ పిటిషన్​పై విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన అన్ని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | ఏసీబీ కేసులపై గురువారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు (Andhra Pradesh High Court) ఎఫ్​ఐఆర్​లను కొట్టివేస్తూ వెలువరించిన తీర్పును తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్​లో నమోదైన ఏసీబీ కేసుల ఎఫ్​ఐఆర్​లను గతంలో ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) ఆ పిటిషన్​పై విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదని తేల్చి చెప్పింది. రద్దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Supreme Court | అసలు ఏం జరిగిందంటే..

అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి 2016 నుంచి 2020 మధ్య ఏసీబీ విజయవాడ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడ పోలీస్ స్టేషన్‌ను సీఆర్‌పీసీలోని సెక్షన్ 2(ఎస్) కింద పోలీస్ స్టేషన్‌గా నోటిఫై చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి దానికి అధికార పరిధి లేదని వారు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎఫ్​ఐఆర్​లను కొట్టివేసింది.

Supreme Court | తప్పుపట్టిన సుప్రీం

హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వైఖరి న్యాయానికి విఘాతం కలిగించడమేనని జస్టిస్ సుందరేష్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులలోని ఎఫ్‌ఐఆర్‌లు, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తుపై హైకోర్టు ఇకపై ఎలాంటి పిటిషన్లను స్వీకరించకూడదని పేర్కొంది. “మా పరిశీలనలో ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడానికే హైకోర్టు అనవసరంగా శ్రమించింది’’ అని న్యాయమూర్తులు అన్నారు. ఆ కేసుల్లో దర్యాప్తును కొనసాగించడానికి ఏసీబీకి స్వేచ్ఛను ఇచ్చింది. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రతివాదులను అరెస్ట్​ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని వారికి సూచించింది.

Related articles

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...

Odisha Mines Officer Bribery | లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్​ అధికారి.. ఇంట్లో రూ.4 కోట్లు సీజ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha Mines Officer Bribery | ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా...

Private Hospital Case | ప్రైవేట్​ ఆస్పత్రిలో యువకుడి అనుమానాస్పద మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు

నగరంలో ప్రైవేట్​ ఆస్పత్రిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆస్పత్రిలో మత్తు వైద్యుల నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్ (Indian Forest Service) మెయిన్స్​​ ఫలితాలను యూపీఎస్సీ విడుదల...