HomeUncategorizedAnantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లో వెలుగుచూసింది. ఇక్కడ ఆర్థిక సాయం చేసే గురువునే తన ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​కు పాల్పడింది సదరు శిష్యురాలు.

అనంతపురం జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చదువుకునేందుకు సాయం చేసిన లెక్చరర్​ను బెదిరించి డబ్బులు గుంజుతూ వచ్చింది. తన ప్రియుడితో కలిసి తీవ్ర మనో వేదనకు గురిచేసి, గురువును ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించింది.

Anantapur : సాయం చేయడమే పాపమన్నట్లు..

పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌ సతీష్​కు ఎదురైన ఘటన ఇది. అదే కళాశాలలో చదువుకునే ఓ పేద విద్యార్థినికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో బాధిత లెక్చరర్​ డబ్బు సాయం చేశారు. తరచూ ఆయన అందించే సాయం ఆమెకు సరిపోలోదేమో.. ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బులు లాగాలని ప్రయత్నించింది.

ఇందుకు తన బాయ్​ ఫ్రెండ్​తో కలిసి పెద్ద ప్లానే వేసింది. ఈ ప్లాన్​లో భాగంగా.. ఆమె ప్రియుడు లెక్చరర్​కు ఫోన్​ చేశాడు. విద్యార్థినితో ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని, లైంగికంగా వేధిస్తున్నావని నిలదీశాడు. అదే ఫోన్​లో అమ్మాయిని కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నాడు ప్రియుడు. కన్నింగ్​ నేచర్​ ఉన్న శిష్యురాలు తన ప్రియుడికే వంత పాడింది. అలా ముగ్గురు మాట్లాడిన సంభాషణలను ప్రియుడు, ప్రియురాలు రికార్డ్ చేశారు.

ఈ సంభాషణను అడ్డం పెట్టుకుని గురువును బ్లాక్​మెయిల్​ చేయసాగారు. అతడిని రచ్చకీడుస్తామని బెదిరించసాగారు. అలా లెక్చరర్ వద్ద అడపాదడపా రూ. లక్షన్నర వరకు వసూలు చేశారు.

తన బాయ్​ ఫ్రెండ్​తో కలిసి పదే పదే డబ్బులు money డిమాండ్​ చేస్తూ వేధించడంతో లెక్చరర్​ lecturer సతీష్​ ఆత్మహత్యకు యత్నించారు. విషయం తన స్నేహితులకు తెలియడంతో వారు సతీష్​కు కౌన్సెలింగ్​ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు భయపడటం దేనికని ధైర్యం చెప్పి, పోలీసుల వద్దకు తీసుకొచ్చారు.

Anantapur : పక్కా ప్లాన్​తో..

అలా పోలీసుల Police సూచన మేరకు సతీష్ వారికి ఫోన్​ చేశాడు. డబ్బులు ఇస్తానని రమ్మన్నాడు. దీంతో ప్రియుడితో కలిసి ఆ మోసవన్నె శిష్యురాలు student అక్కడికి రాగా.. సతీష్​ డబ్బులు ఇచ్చారు. వారు తీసుకున్న వెంటనే.. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాశకు పోయి, ప్రియుడితో కలిసి సాయం చేసిన గురువునే మోసం చేయాలని చూసిన కన్నింగ్​ నేచర్​ విద్యార్థిని ప్రస్తుతం జైల్లో jail  ఊచలు లెక్కిస్తోంది.