అక్షరటుడే, ఇందూరు: Sumitra Devi Kishore | తనను గెలిపిస్తే 24వ డివిజన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని బీజేపీ అభ్యర్థిని ఇప్పకాయల సుమిత్ర దేవి కిషోర్ (Sumitra Devi Kishore) అన్నారు. ఈ మేరకు నగరంలోని గాయత్రి నగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Sumitra Devi Kishore | ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో..
ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సహకారంతో డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సుమిత్రదేవి కిషోర్ అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో ముందుంటామని, డివిజన్లోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తులో డివిజన్ అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు .
24వ డివిజన్లో..
24వ డివిజన్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఇప్పకాయల సుమిత్ర దేవి కిషోర్ సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామని ఇప్పకాయల సుమిత్ర దేవి కిషోర్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినిని ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా, యువ మోర్చా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

