అక్షర టుడే, బోధన్: Bodhan | ఎంఐఎం పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలని నూతనంగా ఎన్నికైన ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ (MIM town president Mir Ilyaz Ali) కోరారు. ఆదివారం తన నివాసంలో మాట్లాడుతూ.. ఈనెల 13న రాకాసిపేట్ లోని మహర్బా ఫంక్షన్ హాల్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owaisi), మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ హాజరు కానున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. అనంతరం పట్టణంలోని జలాల్ బుఖారి దర్గాలో చాదర్ ను సమర్పణ, తన నివాసంలో భోజన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అహమ్మద్ బిన్ మోసిన్, కోశాధికారి హబీబ్ ఖాన్, ఖదీర్, అహమ్మద్ అబ్దుల్ అల్తాఫ్, సమీర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

