HomeతెలంగాణEducation Department | సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

Education Department | సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో అశోక్ (DEO Ashok)​ అన్నారు. నగరంలోని బోర్గాం(పి) జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High School) గెజిటెడ్​ హెడ్​మాస్టర్లకు, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్ల బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.

అనంతరం గెజిటెడ్​ హెచ్​ఎంలకు డాక్టర్​ జలగం తిరుపతి రావు (Dr. Jalagam Tirupati Rao) ఆధ్వర్యంలో మోటివేషన్​ తరగతులు (Motivation classes) నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులకు హెల్త్​ ఎడ్యుకేటర్లు వెంకటేశ్వర్లు, స్వామిసులోచన అవగాహన కల్పించారు. లాటే షీటీం యాక్టివిటీస్​ గురించి షీటీం ఎస్సై స్రవంతి అవగాహన కల్పించారు. సైకియాట్రిస్ట్​ ​వివేక్ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.​ ​శిక్షణ కార్యక్రమంలో 95మంది హెచ్​ఎంలు, 201 మంది బయోసైన్స్​ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెంటర్​ ఇన్​ఛార్జి శంకర్​ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది.