అక్షరటుడే, బాన్సువాడ : Former MLA Bajireddy Govardhan | కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ రథసారధి, తొలి సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా వర్నిలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేశారు.
Former MLA Bajireddy Govardhan | తెలంగాణ తెచ్చిన నాయకుడు..
తెలంగాణ తెచ్చిన నాయకుడిని అవమానించడం తగదని, ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గేవాళ్లు కాదని.. రెట్టించిన ఉత్సాహంతో మున్సిపల్ పోరులో ముందుంటారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులు అనేవి మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) భాగంగా కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని అభివర్ణించారు.
Former MLA Bajireddy Govardhan | తగ్గేదే లేదు..
రాష్ట్రంలో రెట్టించిన ఉత్సాహంగా పనిచేసి మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని బాజిరెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాసరావు, బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి గిర్దావర్ గంగిరెడ్డి, బీఆర్ఎస్వీ నిజామాబాద్ జిల్లా (Nizamabad district) కో–ఆర్డినేటర్ ఎజాజ్, నాగభూషణం, గంగప్ప, అర్జున్, నారాయణ గౌడ్, దాస్, ఆనంద్ గౌడ్, గైని లక్ష్మణ్, ఆసిఫ్, సక్లయిన్, మహేందర్ రెడ్డి, హరికృష్ణ, వెల్మల అశోక్, గుండ్ల హన్మాండ్లు, గంగాకిరణ్, జలీల్, యునుస్, జంగం రాచప్ప, బన్నీ తదితరులు పాల్గొన్నారు.