అక్షరటుడే, వెబ్డెస్క్ : India -US Trade Deal | భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రధాన మంత్రి నరేంద్ర (PM Narendra Modi) మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఈ శతాబ్దపు గొప్ప సంఘటనగా ఆయన అభివర్ణించారు.
ఢిల్లీ (Delhi)లో మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో మోదీ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై స్పందిస్తూ.. ఇది ప్రపంచ వేదికపై భారత్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం కేంద్ర పాత్రధారిగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రపంచ సమతుల్యతను కాపాడుకోవడంలో దాని పాత్ర మరింత కీలకంగా మారుతోందన్నారు. ట్రంప్ (Donald Trump) భారతీయ వస్తువులపై సుంకాలను తగ్గించాలనే నిర్ణయంతో కొంతమంది వినాశనానికి గురయ్యారు అని ప్రధాని అన్నారు.
India -US Trade Deal | ప్రధానికి సన్మానం
అమెరికా (America)తో వాణిజ్య ఒప్పందం కుదరడంపై ఎంపీలు ప్రధానిని ఘనంగా సన్మానించారు. కాగా అమెరికా భారత్పై పరస్పర సుంకాలను
25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. మోదీ మాట్లాడుతూ.. అమెరికా టారిఫ్లతో ప్రజలు తమను విమర్శించినా సహనంతో ఉన్నామన్నారు. అదే తమను గెలిపించిందని చెప్పారు. ఈ ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందని మోదీ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ యూరోపియన్ యూనియన్ (European Union), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్, ఆస్ట్రేలియా, UK, న్యూజిలాండ్, US లతో విజయవంతంగా ప్రధాన వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని తెలిపారు. ఇది సాధారణ విజయం కాదన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తుందని కొనియాడారు.