ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరినీ మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్​ఎస్ పార్టీ(BRS Party)ని ప్రభుత్వం కక్షగట్టిందని, హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)కు నోటీసులిచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

    MLC Kavitha | హామీల అమలేది?

    కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారం కోసం అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా మహిళలు, రైతులు, యువకులు అందరినీ మోసం చేసిందని విమర్శించారు. రైతు భరోసా(Rythu Bharosa) సహా అన్ని హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ‘పింఛన్లు పెంచలేదు.. మహిళలందరికీ ఇస్తామన్న రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగ్గొట్టిందన్నారు. వానాకాలం పంట సీజన్ మొదలైంది.. రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికీ రైతుభరోసా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది.. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా.. లేక రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి’ అని కవిత పేర్కొన్నారు.

    READ ALSO  Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | ప్రశ్నిస్తే కేసులు..

    కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కవిత(MLC Kavitha) మండిపడ్డారు. హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందన్నారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) పేరుతో కేసీఆర్​ను విచారణ చేసిందని, ఇవాళ కేటీఆర్​ను ఏసీబీ(ACB) విచారిస్తోందని తెలిపారు. మేం వేధింపులకు భయపడే వాళ్లం కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు తాళం వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మా కార్యకర్తలు, నాయకులను బయటికు రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. మా పార్టీ లోపాలను సవరించుకుంటామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు.

    READ ALSO  RTC | ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీస్ శిక్షణ

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...