Homeతాజావార్తలుBandi Sanjay | కాలేజీలను బ్లాక్​మెయిల్​ చేస్తున్న ప్రభుత్వం.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay | కాలేజీలను బ్లాక్​మెయిల్​ చేస్తున్న ప్రభుత్వం.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

పెండింగ్​ ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | ఫీజు రీయింబర్స్​మెంట్​ (Fee Reimbursement) బకాయిలు అడిగిన కాలేజీలను ప్రభుత్వం బ్లాక్​మెయిల్​ చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. విజిలెన్స్ దాడులతో యాజమాన్యాలను భయపెడుతోందని ఆరోపించారు.

హైదరాబాద్‌ నల్లకుంటలోని శంకర మఠాన్ని బుధవారం ఉదయం బండి సంజయ్​ (Bandi Sanjay) సందర్శించారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్​తో చెలగటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు. పెండింగ్‌ ఫీజులన్నీ చెల్లించేవరకు కాలేజీలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగవద్దని సూచించారు.

Bandi Sanjay | బీహార్​కు డబ్బు పంపుతున్నారు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) పైసలు ఇక్కడి నుంచే పంపుతున్నారని బండి సంజయ్​ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల బకాయిలు చెల్లించలేరా అని ప్రశ్నించారు. తక్షణమే రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలతో కలిసి ఆందోళనలు చేపడుతామన్నారు. మంత్రులను రోడ్లపై తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.

Bandi Sanjay | జూబ్లీహిల్స్​లో బీజేపీదే గెలుపు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubilee Hills by-Election) బీజేపీ గెలుస్తుందని సంజయ్​ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో, ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం జూబ్లీహిల్స్​ నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు.