ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

    Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ట్రాన్స్​కో ఆపరేషన్స్​(Transco Operations) డీఈ ఎండీ ముక్తార్ పేర్కొన్నారు. విద్యుత్ సంస్థ(Electricity department) అభివృద్ధిలో భాగంగా కొత్తపల్లి సబ్​స్టేషన్​ కోటగిరి సెక్షన్, రుద్రూర్ (Rudrur) సబ్ డివిజన్లలో నూతన వీసీబీలను ఆయన ప్రారంభించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. గృహ వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే క్రమంలో నూతన వీసీపీలను ప్రారంభించామన్నారు. రూ.3 లక్షలతో ఈ పరికరాలను అమర్చామని ఆయన తెలిపారు. కొత్తపల్లి (Kothapally) గ్రామ వినియోగదారులకు, అగ్రికల్చర్​ ఫీడర్​కు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన వివరించారు.

    ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ ఐఏఎస్ వరుణ్ రెడ్డి(NPDCL Chairman IAS Varun Reddy) ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎండీ ముక్తార్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు సరైన సేవలందించడాన్ని బాధ్యతగా భావించాలని కోరారు.

    అలాగే రైతుల ఎక్కడ కూడా సొంతంగా విద్యుత్​ పనులు చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ రుద్రూర్ తోట రాజశేఖర్, కోటగిరి ఏఈ బుజ్జిబాబు, విద్యుత్ సిబ్బంది ప్రేమ్ దాస్, వెంకటేశం, రాజు గౌడ్, రవి వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Vote Chori | ఓటు చోరుల‌ను కాపాడుతున్న ఈసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోప‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)పై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి...

    BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పీసీసీ చీఫ్​

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్​ బొమ్మ...

    IRCTC | శివ‌భ‌క్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IRCTC | శివ భ‌క్తుల కోసం భారతీయ రైల్వే (Indian Railways) ఒక ప్రత్యేక...