అక్షరటుడే, కామారెడ్డి: ఉగ్రవాదుల ఆట కట్టించినప్పుడే దేశంలో శాంతి నెలకొంటుందని కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్(Kamareddy Vishwakarma Carpenters Association) ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam terror attack) మృతి చెందిన అమరులకు నివాళులర్పిస్తూ గురువారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ (Candlelight rally) నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ ర్యాలీ తీశామన్నారు. పట్టణంలోని పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి పాంచ్ రస్తా, సుభాష్ రోడ్, రైల్వే కమాన్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ (Carpenters Association) అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రెటరీ రాజు, కోశాధికారి నాగభూషణం, సహాయ కోశాధికారి రమేష్, సహాయ కార్యదర్శి వెంకట స్వామి, ముఖ్య సలహాదారులు బ్రహ్మం, గంగాధర్, మారుతి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Candlelight rally |ఉగ్రమూకల ఆట కట్టించాల్సిందే..
5