HomeతెలంగాణOsmania Hospital | దేశంలోనే తొలిసారి పేగు మార్పిడి ఆపరేషన్​.. ఎక్కడో తెలుసా..!

Osmania Hospital | దేశంలోనే తొలిసారి పేగు మార్పిడి ఆపరేషన్​.. ఎక్కడో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Osmania Hospital | ఉస్మానియా జనరల్​ ఆస్పత్రి osmania hospital వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే ప్రభుత్వ మొట్టమొదటి సారి పేగు మార్పిడి(Intestinal Transplant) ఆపరేషన్​ను విజయవంతంగా నిర్వహించారు. దీంతో సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) వైద్య బృందాన్ని అభినందించారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమైన క్షణమని వైద్యులు, సిబ్బంది బృందాన్ని కొనియాడారు.

Osmania Hospital | 40 ఏళ్ల రోగికి శస్త్ర చికిత్స

షార్ట్ గట్ సిండ్రోమ్‌(Short Gut Syndrome)తో బాధపడుతున్న 40 ఏళ్ల రోగికి వైద్యులు ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు సమాచారం. లిక్విడ్ ఆహారాన్ని సైతం తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఇది తెలంగాణ(Telangana)లో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో మొట్టమొదటి విజయవంతమైన పేగు మార్పిడి ఆపరేషన్ (Intestinal Transplant Operation)​, అలాగే భారతదేశంలోని మొత్తం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగంలో మొదటి కేసు. దీంతో సీఎం రేవంత్​ రెడ్డి ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది(Osmania Hospital Staff)ని అభినందించారు.