Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలో ఆందోళన

Bodhan | మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాల్సిందే.. వర్షంలో ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan | జీపీ తరపున విధులు నిర్వహిస్తూ సిద్ధాపూర్​లో (Siddhapur) ట్రాక్టర్​ బోల్తా పడి మృతి చెందిన ఇద్దరికి పరిహారం ఇవ్వాలని మృతుల బంధువులు డిమాండ్​ చేశారు. బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రిలోని (Bodhan Government Hospital) పోస్టుమార్టం గది ఎదుట వారు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా మృతుల బంధువులు,కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. జీపీ తరపున పనిచేస్తూ వారు అకాల మరణం చెందినందున ఒక్కొక్కరికి రూ. 50లక్షల చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్​ చేశారు. వర్షంలోనూ వారు ధర్నా కొనసాగించారు.

సమాచారం అందుకున్న బోధన్​ తహశీల్దార్​ విఠల్ ​(Bodhan Tahsildar Vitthal), బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు (Bodhan Rural CI Vijay Babu) బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.