HomeతెలంగాణParty defections | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. నోటీసులు ఇచ్చే యోచనలో స్పీకర్​

Party defections | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. నోటీసులు ఇచ్చే యోచనలో స్పీకర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Party defections | బీఆర్​ఎస్ (BRS)​ నుంచి గెలిచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ (Speaker Prasad)​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ అయితే బీఆర్​ఎస్​ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్​ నుంచి ఎంపీగా పోటీ చేశారు. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారగా.. ఆయన కూతురు ఎంపీ టికెట్​ పొంది గెలిచారు. వీరితో పాటు పోచారం శ్రీనివాస్​ రెడ్డి, సంజయ్​కుమార్, తెల్లం వెంకట్రావ్, అరికపుడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్​గౌడ్​, మహిపాల్​రెడ్డి, కృష్ణమోహన్​రెడ్డి బీఆర్​ఎస్​ను వీడి హస్తం గూటికి చేరారు.

Party defections | సుప్రీంకోర్టు తీర్పుతో..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘకాలం వాదనలు విన్న కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​కు సూచించింది. ఈ మేరకు గత నెల 31న తీర్పు చెప్పంది. సుప్రీం తీర్పు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు (Notice) ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఆయన న్యాయ సలహా (Legal Advice) తీసుకున్నట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని స్పీకర్​ నిర్ణయించారు. అనంతరం ఆయన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు.