అక్షరటుడే, వెబ్డెస్క్ : Party defections | బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Prasad) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారగా.. ఆయన కూతురు ఎంపీ టికెట్ పొంది గెలిచారు. వీరితో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్కుమార్, తెల్లం వెంకట్రావ్, అరికపుడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్గౌడ్, మహిపాల్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్ను వీడి హస్తం గూటికి చేరారు.
Party defections | సుప్రీంకోర్టు తీర్పుతో..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘకాలం వాదనలు విన్న కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. ఈ మేరకు గత నెల 31న తీర్పు చెప్పంది. సుప్రీం తీర్పు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు (Notice) ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఆయన న్యాయ సలహా (Legal Advice) తీసుకున్నట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాలని స్పీకర్ నిర్ణయించారు. అనంతరం ఆయన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు.