అక్షరటుడే, ఇందూరు: Rotary Club | కార్గిల్ అమరవీరుల త్యాగాన్ని వెలకట్టలేమని రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు అశోక్ అన్నారు. కార్గిల్ దివస్ను (Kargil Day) పురస్కరించుకొని శనివారం నగరంలోని బర్కత్పురాలో గల క్లబ్ కార్యాలయంలో మాజీ సైనికులకు (Ex servicemen) సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధంలో దేశ సైనికులు విజయఢంకా మోగించి దేశ గౌరవాన్ని ప్రపంచస్థాయిలో నిలిపారన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనికులు అనేక మంది తీవ్రవాదులను మట్టుబెట్టిందని అన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన సైనికులు సాయారెడ్డి, సాంసన్, గంగా ప్రసాద్లను సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, శ్రీనివాసరావు, రామ్మోహన్ రావు, సతీష్, మోటూరి మురళి, విజయరావు, జితేంద్ర మలాని, రాజ్కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.