Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevanreddy | పొంతనలేని మాటలతో సీఎం తెలంగాణ పరువు తీస్తున్నారు..

Ex Mla Jeevanreddy | పొంతనలేని మాటలతో సీఎం తెలంగాణ పరువు తీస్తున్నారు..

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Ex Mla Jeevanreddy | పొంతనలేని మాటలతో రేవంత్​రెడ్డి (CM Revanth reddy) ఢిల్లీలో (Delhi) తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఏమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా కపట ఎత్తుగడలతో సీఎం రేవంత్​రెడ్డి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

గత ఎన్నికలలో బీఆర్ఎస్ (BRS) ఓటమి కేసీఆర్​కు (KCR) పెద్దశిక్ష అని, ఎర్రవెల్లి ఫామ్​హౌస్​లో (Erravelli Farmhouse) స్వీయ నిర్బంధంలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని.. ఎన్నికల్లో ఓడిపోవడం ఎలా పెద్దశిక్ష అవుతుందో రేవంత్​కే తెలియాలని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవుతోందని జీవన్​రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ఇందిరా గాంధీతో (Indira Gandhi) పాటు అమేథీ, రాయబరేలీ స్థానాల్లో రాహుల్, కొడంగల్​లో రేవంత్ కూడా ఓడిపోయారని జీవన్​రెడ్డి గుర్తు చేస్తూ వారి ఓటమిలు కూడా కాంగ్రెస్​కు పడిన పెద్దశిక్షలేనా అని నిలదీశారు.

ఎప్పటికీ గెలవలేని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు మరణశిక్ష పడినట్లు భావించాలా.. అని ఆయన ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి ప్రిజనరీ అని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు, తొలి సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ నేత అని ఆయన అభివర్ణించారు.