ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BJP Nizamabad | జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

    BJP Nizamabad | జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | ప్రధాని మోదీ (PM Modi) జీఎస్టీపై (GST) తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ (Nagolla Lakshminarayana) అన్నారు. ఖిల్లా రాం మందిర్ (Killa Ram Mandir) మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి  శుక్రవారం పాలాభిషేకం చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో మోదీ నిర్ణయాలు ఎంతో కీలకంగా మారాయని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు భారత్​ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.

    కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడూరు నాగరాజు, మాజీ కార్పొరేటర్ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు మఠం పవన్, చిరంజీవి, ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు మారుతి, శక్తి కేంద్ర ఇన్​ఛార్జీలు, పార్టీ కార్యాలయం ఇన్​ఛార్జి బద్దంకిషన్, మీడియా సెల్ కన్వీనర్ వీరేందర్, వెంకటరాములు, కిరణ్ రాథోడ్, చంద్రకాంత్, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Donald Trump | భారత్, రష్యా దూరమైనట్లే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Donald Trump | సుంకాల విధింపుతో భారత్ తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ...

    Rajampet mandal | తృటిలో తప్పిన పెను ప్రమాదం.. గ్యాస్​ ట్యాంకర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

    అక్షరటుడే, కామారెడ్డి: Rajampet mandal | గ్యాస్ ట్యాంకర్​ను ఆర్టీసీ బస్సు వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ఘటన రాజంపేట...

    Sushanth-Meenakshi | మ‌రోసారి అడ్డంగా దొరికిన సుశాంత్-మీనాక్షి.. రిలేష‌న్ గురించి అనేక ఊహాగానాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Sushanth-Meenakshi | యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్,...