Kamareddy | కల్లుగీత వృత్తిపై కేంద్రం చిన్నచూపు

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | దేశీయ వస్తువులనే వాడాలని చెప్పే కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకృతి పానీయాలైన నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్​ అండ్​బీ గెస్ట్ హౌస్​లో (R&B Guest House) శనివారం గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. సాఫ్ట్ డ్రింక్​లను ఉత్పత్తి చేసే బడా కార్పొరేట్ కంపెనీలు రూ. […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | దేశీయ వస్తువులనే వాడాలని చెప్పే కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకృతి పానీయాలైన నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ ప్రశ్నించారు.

పట్టణంలోని ఆర్​ అండ్​బీ గెస్ట్ హౌస్​లో (R&B Guest House) శనివారం గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. సాఫ్ట్ డ్రింక్​లను ఉత్పత్తి చేసే బడా కార్పొరేట్ కంపెనీలు రూ. కోట్లల్లో ప్రజల నుండి దండుకుంటున్నాయన్నారు.

ఇన్నేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒక్క పథకమైనా గీత కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. వారు పెంచిన జీఎస్టీని వారే తగ్గించి ప్రజలను పండుగ చేసుకోండని ప్రధాని (Prime Minister Modi) అంటున్నారని, నిరుపేదలందరికీ ఇంటికి రూ.20 లక్షలు ఇస్తే సంబురంగా పండుగ చేసుకుంటారన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేస్తామంటున్నారని, కల్లుగీత సొసైటీ సభ్యుల గురించి ఎందుకు ఆలోచించరని నిలదీశారు.

తమ వృత్తిని ఆధునికరించి నీరా, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతీ యువకులకు ఉపాధి కలిగించే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి సిరిపురం రమేష్ మాట్లాడుతూ.. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి హైబ్రిడ్ తాటి, ఈత వనాలు పెంచాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో నీరా తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలని, ప్రతి జిల్లాలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.

కల్తీకల్లు పేరుతో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు (Excise Officers) చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని రైతు బీమా తరాహాలోనే గీత కార్మికులందరికీ గీతన్న భీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షుడు యాదగిరి గౌడ్, రవీందర్ గౌడ్ శంకర్ గౌడ్, మోహన్ గౌడ్, కార్యదర్శులు రమేష్ గౌడ్, రాజా గౌడ్, కమిటీ సభ్యులు స్వామి గౌడ్, హన్మాగౌడ్, కృష్ణాగౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.