Homeజిల్లాలునిజామాబాద్​Brahma kamalam | వికసించిన బ్రహ్మ కమలం

Brahma kamalam | వికసించిన బ్రహ్మ కమలం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు/కోటగిరి: Brahma kamalam | హిమాలయాల్లో (In the Himalayas) మాత్రమే వికసించే బ్రహ్మకమలానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పుష్పం అరుదుగా మాత్రమే పూస్తుంది. అలాంటి బ్రహ్మ కమలం ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లాలోనూ విరబూసింది.

విద్యుత్​శాఖలో (Electricity Department) పనిచేస్తున్న ఏడీఈ తోట రాజశేఖర్ (ADE Thota Rajasekhar) దంపతులు నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరు కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మురుడేశ్వర్ (Murudeshwar)​ నుంచి గతంలో మొక్కను తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటారు.

ప్రస్తుతం ఆ మొక్కకు మూడు పువ్వులు పూశాయి. అలాగే పోతంగల్(pothangal)మండల కేంద్రంలో జింగరి గంగాధర్​, జయశ్రీ దంపతులు బ్రహ్మకమలం మొక్కను బద్రీనాథ్​ (Badrinath) నుంచి తెచ్చారు. ఆ మొక్క సైతం పుష్పించింది. ఈ సందర్భంగా ఆ పువ్వులకు ప్రత్యేక పూజలు చేశారు.

Brahma kamalam | వర్ని మండలంలోని గోవూరులో..

వర్ని మండలంలోని గోవూర్​ గ్రామంలోనూ బ్రహ్మకమలం వికసించింది. దీంతో ఈ పువ్వుకు భక్తులు భక్తితో పూజలు చేశారు.