ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిThadwai | నీళ్లు ఇవ్వకుండా.. విద్యార్థులను ఎండలో నిలబెట్టి..

    Thadwai | నీళ్లు ఇవ్వకుండా.. విద్యార్థులను ఎండలో నిలబెట్టి..

    Published on

    అక్షరటుడే, తాడ్వాయి: Thadwai | పాఠశాలకు లేటుగా వచ్చారని విద్యార్థులతో పాఠశాల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. మండుటెండలో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. ఈ ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

    విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో (Gurukul School) ఈనెల 15న విద్యార్థులను తీసుకుని రావాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను ఐదురోజులు లేటుగా శుక్రవారం పాఠశాలకు తీసుకెళ్లారు. దీంతో లేటుగా వచ్చారని ఆరోపిస్తూ గురుకుల పాఠశాల సిబ్బంది కనీసం గేటు కూడా తీయలేదు. దీంతో మండుటెండలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. కనీసం చిన్నారులకు నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Thadwai | ఉపాధ్యాయులు బయటకు రాకుండా తాళాలు..

    ఎండలతో తమతోపాటు విద్యార్థులును సైతం ఎండలో నిలబెట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బయటకు రాకుండా మెయిన్​ గేట్​కు తాళాలు వేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గురుకుల పాఠశాలకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. ఎట్టకేలకు విద్యార్థులను స్కూల్​ లోపలికి అనుమతించారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...