Terror Attack | రేపు కేంద్ర కేబినెట్​ భేటీ
Terror Attack | రేపు కేంద్ర కేబినెట్​ భేటీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | కేంద్ర మంత్రివర్గ సమావేశం cabinet meeting ప్రధాని నరేంద్ర మోదీ pm modi అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. భారత్​–పాక్​ మధ్య ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఇప్పటికే త్రివిధ దళాధిపతులు, ముఖ్య కార్యదర్శులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. తాజాగా కేబినెట్​ భేటీ నిర్వహిస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్​ చర్యలతో పాక్​ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్​ తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని భయంతో ఉన్న పాక్​ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినేట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.