అక్షరటుడే, వెబ్డెస్క్: Tenth Supplementary Exams | పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు (ssc board) వెల్లడించింది. ఫీజు చెల్లింపునకు మే 16వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది.
Tenth Supplementary Exams | రీకౌంటింగ్.. రీవెరిఫికేషన్..
విద్యార్థులు రీకౌంటింగ్ (Recounting).. రీవెరిఫికేషన్ (ssc Reverification) కోసం మే15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. రీకౌంటింగ్ కోసం సబ్జెక్ట్కు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సబ్జెక్ట్కు రూ.1,000 చెల్లించి రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.