HomeతెలంగాణBJP Protest | సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. బీజేపీ నాయకుల అరెస్ట్​

BJP Protest | సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. బీజేపీ నాయకుల అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Protest | తెలంగాణ సచివాలయం దగ్గర శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నగరంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​తో ‘సేవ్ హైదరాబాద్'(Save Hyderabad) పేరిట బీజేపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. సచివాలయం ముట్టడించడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు.

దీంతో సెక్రెటేరేట్ ​(Secretariat) దగ్గర భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్​ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్​ నగరంలో డ్రైనేజీ సమస్యలు (Drainage Problems), గుంతల రోడ్లు, ఇటీవల విద్యుత్​ తీగలు తగిలి పలువురి మృతి చెందడం వంటి సమస్యలపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. జీహెచ్​ఎంసీ (GHMC), జలమండలి, హైడ్రా మధ్య సమన్వయం లేకపోవడంతో నగరంలో సమస్యలు పేరుకుపోతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సేవ్​ హైదరాబాద్​ పేరిట సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది.

 BJP Protest | అడ్డుకున్న పోలీసులు

బీజేపీ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్​ చేశారు. సచివాలయం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు కార్యకర్తలు సచివాలయం గేటు ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. నాయకులను పోలీసులు అరెస్ట్​ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.

 BJP Protest | బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును (BJP State President Ramchandra Rao) సైతం పోలీసులు అరెస్ట్​ చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో మొయినాబాద్‌ దగ్గర ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 BJP Protest | ఖండించిన ఈటల

సచివాలయం దగ్గర బీజేపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్​ను మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ ​(MP Eatala Rajender) ఖండించారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.