HomeతెలంగాణForest Land | మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత.. అటవీ ప్రాంతంలో గుడిసెలు తొలగిస్తున్న అధికారులు

Forest Land | మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత.. అటవీ ప్రాంతంలో గుడిసెలు తొలగిస్తున్న అధికారులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Land | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట(Dammanapeta)లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివాసీలు అటవీ ప్రాంతంలో వేసుకున్న గుడిసెలను ఫారెస్ట్​ అధికారులు తొలగిస్తున్నారు.

దండేపల్లి మండలం(Dandepalli Mandal) లింగాపూర్‌ అటవీ బీట్‌లో పరిధిలో దమ్మన్నపేట, మామిడిగూడకు చెందిన కొందరు గుడిసెలు వేసుకున్నారు. ఈ విషయం తెలిసి అధికారులు శుక్రవారం దమ్మనపేట్​ వెళ్లి గుడిసెలు వేసుకోవడం తప్పని చెప్పారు. వాటిని తొలగిస్తామన్నారు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారుల(Forest Officers)పై దాడులకు పాల్పడ్డారు. సిబ్బంది కళ్లలో కారం కొట్టి గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో సెక్షన్‌ ఆఫీసర్​ బాలకృష్ణ, బీట్‌ అధికారి పరమేశ్వర్, బేస్‌క్యాంప్‌ వాచర్‌ రాజేందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సిబ్బంది దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Forest Land | భారీ బందోబస్తు మధ్య..

అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకోవడమే కాకుండా.. సిబ్బందిపై దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు సీరియస్​గా తీసుకున్నారు. అక్రమంగా వేసుకున్న గుడిసెలను తొలగించడానికి శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య తరలివచ్చారు. 300 మంది ఫారెస్ట్ సిబ్బంది(Forest Staff), 200 మంది పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతంలో వేసిన గుడిసెలను జేసీబీల సాయంతో తొలగించారు.

Forest Land | రైతుల వాగ్వాదం

అటవీ ప్రాంతంలోని గుడిసెలు, పోడు పంటలను తొలగించారు. మూడు జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోడు రైతులు అటవీ శాఖ అధికారులతో తీవ్ర వాగ్వాదం చేశారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 16 మంది ఆదివాసీ మహిళలను సైతం అదుపులోకి తీసుకున్నారు.