HomeUncategorizedYS Jagan | జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత

YS Jagan | జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొగాకు రైతులకు(tobacco farmers) మద్దతుగా బుధవార వైఎస్​ జగన్​ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు(TDP Leaders), మహిళలు జగన్​కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల ‘సాక్షి’ డిబేట్​లో అమరావతి(Amaravathi) మహిళల గురించి అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలపై జగన్​ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్​ చేశారు.

నల్ల బెలూన్లు, ప్లకార్డులతో మహిళల నిరసన తెలిపారు. కాన్యాయ్​పైకి కొందరు మహిళలు చెప్పులు విసిరారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు(YSRCP Leaders) రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్(Police Constable)​కి గాయాలు కాగా.. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు మహిళలు సైతం గాయపడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

YS Jagan | దాడిని ఖండించిన మంత్రి లోకేశ్

పొదిలిలో వైసీపీ సైకోల దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి లోకేష్‌(Minister Lokesh) తెలిపారు. మహిళలు, పోలీసులపై దాడులు చేయడం దారుణమని ఆయన అన్నారు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.