ePaper
More
    HomeతెలంగాణHMDA | హెచ్​ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన ఆర్​ఆర్​ఆర్​ భూ నిర్వాసితులు

    HMDA | హెచ్​ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన ఆర్​ఆర్​ఆర్​ భూ నిర్వాసితులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HMDA | హైదరాబాద్ (Hyderabad)​ చుట్టూ రీజినల్​ రింగ్​ రోడ్డు (RRR) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రెండు దశల్లో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

    హైదరాబాద్​ నగరంలో రద్దీని తగ్గించడంతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్​ఆర్​ఆర్​ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కేంద్రం సైతం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రోడ్డు నిర్మాణం చేపట్టనున్నాయి. అయితే రోడ్డు నిర్మాణంలో వేలాది మంది ప్రజలు భూములు కోల్పోతున్నారు. దీంతో సోమవారం ఉదయం వారు హెచ్​ఎండీఏ కార్యాలయానికి తరలివచ్చారు.

    HMDA | అలైన్​మెంట్​ మార్చాలని..

    ఆర్​ఆర్​ఆర్​ కోసం అధికారులు పలుమార్లు సర్వేలు చేపట్టారు. అయితే మొదట ఒక అలైన్​మెంట్​ ప్రకారం రోడ్డు నిర్మించాలని భావించారు. అనంతరం దానిని మార్చారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత అలైన్​మెంట్ (Old alignment) ప్రకారం నిర్మాణం చేపడితే ప్రభుత్వ, బీడు భూములు పోతాయని, ప్రస్తుత అలైన్​మెంట్​ ప్రకారం రోడ్డు వేస్తే పట్టా భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే RRR భూములను తక్కువ ధరకు కేటాయిస్తున్నారని బాధితులు ఆరోపించారు. భూములు కోల్పోకుండా అలైన్‌మెంట్ మార్చాలని బాధితులు డిమాండ్​ చేశారు. హెచ్​ఎండీఏ కార్యాలయానికి భారీగా బాధితులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    ట్రిపుల్​ ఆర్​ ఎలైన్​మెంట్​ మార్పు విషయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి (Rajagopal Reddy) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దక్షిణ భాగంలో అలైన్​మెంట్​ మారాలంటే.. ఉత్తర భాగంలో సైతం మారాలన్నారు. అలా జరగాలంటే ప్రభుత్వం మారాలేమోనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్​ఆర్​ఆర్​ బాధితులకు న్యాయం జరిగేలా తాను ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కాగా తాజాగా ఆయన నియోజకవర్గంలోని చౌటుప్పల్​, గట్టుప్పల్​ మండల్లాలోని నిర్వాసితులు హెచ్​ఎండీఏ కార్యాలయానికి భారీగా తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    More like this

    Heavy Rains | మాయదారి వాన.. వర్ష బీభత్సంపై కవి ఆవేదన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించిన...

    GST | దిగిరానున్న ధరలు.. నిలిచిన కొనుగోళ్లు.. జీఎస్టీ శ్లాబ్‌ మార్పుతో తగ్గనున్న ధరలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST)లో తీసుకువచ్చిన సంస్కరణల(Reforms)తో వివిధ వస్తువుల ధరలు తగ్గనున్నాయి....

    Mla Prashanth Reddy | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: Mla Prashanth Reddy | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...