అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Temple Governing bodies | జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలకు ఇటీవల పాలకమండళ్లు ఖరారయ్యాయి. ఈమేరకు నూతన ఆలయ కమిటీ ఛైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ఆధ్వర్యంలో కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. జెండా బాలాజీ మందిరం (Jenda balaji Mandir) ఆలయ కమిటీ ఛైర్మన్గా లవంగ ప్రమోద్, శంభులింగేశ్వర ఆలయ (Shambhulingeshwara Temple) కమిటీ ఛైర్మన్గా బింగి మధు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, సహకార యూనియన్ (Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు (Farmers Commission) గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ ఛైర్మన్ భక్తవత్సలం, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం చేస్తున్న జెండాబాలాజీ మందిరం కమిటీ ఛైర్మన్ సభ్యులు