Temple Governing bodies
Temple Governing bodies | ఆలయ కమిటీల ప్రమాణ స్వీకారం

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Temple Governing bodies | జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలకు ఇటీవల పాలకమండళ్లు ఖరారయ్యాయి. ఈమేరకు నూతన ఆలయ కమిటీ ఛైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) ఆధ్వర్యంలో కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. జెండా బాలాజీ మందిరం (Jenda balaji Mandir) ఆలయ కమిటీ ఛైర్మన్​గా లవంగ ప్రమోద్, శంభులింగేశ్వర ఆలయ (Shambhulingeshwara Temple) కమిటీ ఛైర్మన్​గా బింగి మధు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, సహకార యూనియన్​ (Cooperative Union) ఛైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్​ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు (Farmers Commission) గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ ఛైర్మన్ భక్తవత్సలం, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న జెండాబాలాజీ మందిరం కమిటీ ఛైర్మన్​ సభ్యులు