HomeతెలంగాణTemperature | దంచికొడుతున్న ఎండలు.. నిజామాబాద్​లో 45 డిగ్రీలు

Temperature | దంచికొడుతున్న ఎండలు.. నిజామాబాద్​లో 45 డిగ్రీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Temperature | రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ nizamabad district ​temperature జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని సీహెచ్​ కొండూరు ch konduru గ్రామంలో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత Temperature నమోదు అయింది.

ఆదిలాబాద్ adilabad​లో 45.2, నిర్మల్ nirmal​ 45.1, మంచిర్యాల manchiryalలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి ramareddy లో 44.8 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అయింది. మాడు పగిలేలా ఎండలు కొడుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎండలు మండుతుండటంతో ఇళ్లలో నుంచి మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.